ఎమ్మెల్సీ కవితపై భువనగిరి ఎంపీ చామల కిరణ్ రెడ్డి మండిపడ్డారు. ధర్నాచౌక్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఎత్తివేసినా.. కవిత అక్కడికి వెళ్లి ధర్నా చేయడం హాస్యాస్పదమన్నారు. ఆమె ధర్నా చేయాల్సింది ధర్నాచౌక్ వద్ద కాదని, కేసీఆర్ ఫామ్హౌస్ ముందుకెళ్లి చేయాలని ఎద్దేవా చేశారు. బీసీల కోసమే కాంగ్రెస్ కులగణనను చేపట్టిందని, వారి గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్కి లేదని మండిపడ్డారు.