TG: కేసీఆర్, కేటీఆర్ల ఈనో ప్యాకెట్ల బ్యానర్లను హైదరాబాద్ వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులు ఏర్పాటు చేశారు. దావోస్ పర్యటనలో రూ. 1.78 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చిన సీఎం రేవంత్ రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో భారీ పెట్టుబడులను, అభివృద్ధిని కేసీఆర్, కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నట్లు ఉన్న బ్యానర్లను కాంగ్రెస్ నాయకులు ఏర్పాటు చేశారు. కడుపు మంట తగ్గేందుకు ఈనో ప్యాకెట్లు వాడాలంటూ హోర్డింగ్లు పెట్టారు.