TG: ఎర్రవల్లి ఫామ్హౌస్లో BRS చీఫ్ కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావుల భేటీ కొనసాగుతోంది. జూన్ 11న కాళేశ్వరం కమిషన్ ముందు కేసీఆర్ హాజరుకానుండడంతో ఈ సమావేశం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ మీటింగ్కి మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి కూడా హాజరయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలో నిర్మాణ లోపాలు, ఆర్థిక అక్రమాల ఆరోపణలపై జస్టిస్ ఘోస్ కమిషన్ విచారణ చేపట్టిన విషయం తెలిసిందే.