TG: ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి నంది నగర్ నివాసానికి చేరుకున్న BRS చీఫ్ కేసీఆర్ను పార్టీ నేతలు, కార్యకర్తలు అభిమానులు పరామర్శిస్తున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు, వ్యవసాయం, సాగునీరు, ఎరువుల లభ్యత తదితర ప్రజా సమస్యలపై చర్చించారు. సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, నవీన్ కుమార్ రెడ్డి, జైపాల్ యాదవ్, గువ్వల బాలరాజు, తదితరులు కేసీఆర్ను కలిసిన వారిలో ఉన్నారు.