దేశంలో వ్యవసాయ అభివృద్ధికి కేసీఆర్‌ మోడల్‌ అవసరం: కేటీఆర్‌

0చూసినవారు
దేశంలో వ్యవసాయ అభివృద్ధికి కేసీఆర్‌ మోడల్‌ అవసరం: కేటీఆర్‌
TG: మహారాష్ట్రలో రైతుల మరణాలపై BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ స్పందించారు. బీజేపీ పాలిత మహారాష్ట్రాల్లో 3 నెలల్లో 767 మంది రైతులు చనిపోయారని, మహారాష్ట్రలో సగటున ప్రతి 3గంటలకు ఒకరైతు ఆత్మహత్య చేసుకోవడం కలచివేస్తోందన్నారు. ప్రస్తుతం దేశానికి రైతు బంధు, పంటల బీమా, రైతు బీమా, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు, పంటకు గిట్టుబాటు ధర ఇచ్చే వ్యవస్థ కావాలన్నారు. దేశంలో వ్యవసాయ అభివృద్ధికి కేసీఆర్‌ మోడల్‌ అవసరమని X వేదికగా రాసుకొచ్చారు.

సంబంధిత పోస్ట్