TG: కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ విచారణకు బుధవారం ఉ.11.30 గంటలకు BRS అధినేత కేసీఆర్ హాజరుకానున్నారు. ఈ క్రమంలోనే బలప్రదర్శన చేసేందుకు BRS సిద్దమైనట్లు తెలుస్తోంది. కేసీఆర్కు భారీ స్థాయిలో మద్దతు ఇచ్చేందుకు పార్టీ నాయకులుఎం కార్యకర్తలు సిద్ధమవుతున్నట్లు సమాచారం. దాదాపుగా 500 కాన్వాయ్తో, నాయకుల మద్దతుతో కేసీఆర్ ఉ. 9 గంటలకు ఎర్రవెల్లిలోని తన ఫామ్హౌజ్ నుంచి బయలుదేరనున్నట్లు తెలుస్తోంది.