భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో యాక్టర్ గాయత్రి భార్గవి ఎక్స్ వేదికగా పలు సూచనలు చేశారు. “బ్లాక్ అవుట్కు భయపడకండి. సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ న్యూస్ను నమ్మకండి” అంటూ హెచ్చరించారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కోడానికి సన్నద్ధంగా ఉండాలని కోరారు. మందులు, ఆహారం, నిత్యావసర వస్తువులు ముందుగానే సిద్ధం చేసుకోవాలని, ఫోన్ చార్జర్లు, టార్చ్ లైట్లు, పవర్ బ్యాంకులు కూడా సిద్ధంగా ఉంచుకోవాలని తెలిపారు.