భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డీసీసీ అధ్యక్షుడు పొదెం వీరయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. దుమ్ముగూడెం మండలం కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే వెంకట్రావుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు అసలైన కాంగ్రెస్ వ్యక్తి కాదు. వేరే పార్టీలో గెలిచి ఈ పార్టీకి వచ్చాడని అన్నారు. ఆయన రావడం వల్ల ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం జరిగిందన్నారు.