ఖమ్మం నగర పరిధిలో పేద ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై, ఈనెల 17న, ఖమ్మం నగర కార్పొరేషన్ కార్యాలయం ముట్టడిస్తున్నట్లు సిపిఐ (ఎం) కార్యదర్శి వై విక్రమ్ మంగళవారం తెలియజేశారు. ఖమ్మం సుందరయ్య, భవన్ లో ముఖ్య అతిథిగా వై విక్రమ్ సమావేశం ఏర్పటు చేశారు. ఈ కార్యక్రమంలో సుదర్శన్, వెంకన్న బాబు, వీరబాబు, రవీంద్ర హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.