పెండింగ్ లో ఉన్న గ్రామపంచాయతీ కార్మికుల జీతాలు వెంటనే చెల్లించాలని, మల్టీ పర్పస్ వర్కర్స్ విధానాన్ని రద్దు చేయాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు గాదే లక్ష్మీనారాయణ, ఉపాధ్యక్షులు వేము రాంబాబు డిమాండ్ చేశారు. బుధవారం ఏఐటియుసి ఆధ్వర్యంలో ఖమ్మం కలెక్టరేట్ కార్యాలయం ఎదుట కార్మికులతో కలిసి ధర్నా నిర్వహించారు. తెలంగాణ పంచాయతీ రాజ్ జీవో నెంబర్ 501ని వెంటనే సవరించాలని కోరారు. నాయకులు రామాంజనేయులు ఉన్నారు.