వరద బాధితులకు ప్రభుత్వం మంజూరు చేసిన సాయం అందని వారి కోసం కేఎంసీ అధికారులు ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. బ్యాంక్ ఖాతాల వివరాలు తప్పుగా నమోదైన వారి కోసం 14 డివిజన్లకు కలిపి 9 కేంద్రాలను ఏర్పాటు చేశారు. అక్కడే సిబ్బందిని ఉంచి, వివరాలు సరి చేసేలా చర్యలు చేపట్టారు. దీని కోసం ఒక్కో కేంద్రంలో బిల్ కలెక్టర్, కంప్యూటర్ ఆపరేటర్లు ఏర్పాటు చేసి, పర్యవేక్షణ బాధ్యతలను ఆర్ఐలకు శనివారం అప్పగించారు.