కోట్లాది మంది విద్యార్థులకు సమాజ చైతన్యం కలిగించి సమర శీల పోరాట వేదికను అందించింది పీడీఎస్యూ అని పౌరహక్కుల సంఘం మాజీ జిల్లా ఉపాధ్యక్షులు దొబ్బల శిరీష, పీడీఎస్యూ జిల్లా కార్యదర్శి వెంకటేష్ అన్నారు. ఖమ్మం సీపీఐ(ఎంఎల్) మాస్లైన్ కార్యాలయంలో పీడీఎస్యూ 50 ఏళ్ల స్వర్ణోత్సవ సభను శుక్రవారం నిర్వహించారు. విద్య సాధనకు, విద్యార్థి హక్కులకు, విద్యారంగ సమస్యలపై పీడీఎస్యు 30 ఏళ్లుగా సమరశీల పోరాటాలు నిర్వహించిందన్నారు.