ప్రధాని మోడీ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా బీజేపీ నాయకులు సామూహికంగా వీక్షించారు. ఆదివారం ఖమ్మం బీజేపీ పార్టీ జిల్లా కార్యాలయంలో బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి, సహచర నాయకులతో కలిసి జిల్లా అధ్యక్షులు గల్లా సత్యనారాయణ టెలివిజన్ ద్వారా వీక్షించారు. ఈ కార్యక్రమం ద్వారా నలుమూలల్లో ఉన్న భారతీయులను ఏకం చేస్తునందుకు ప్రధాని మోదీకీ ధన్యవాదాలు తెలిపారు.