ఖమ్మం రోటరీనగర్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం మధ్యాహ్నం భోజన పథకాన్ని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ పరిశీలించారు. ప్రతి బుధవారం పాఠశాలలో భోజనం కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. పాఠశాలలో భోజన నాణ్యత, ఆహార పదార్థాలను పరిశీలించారు. విద్యార్ధులతో ముచ్చటిస్తూ భోజనాన్ని ప్రతిరోజు నిర్దేశించిన మెనూ ప్రకారంగా అందిస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు.