ఖమ్మం జిల్లా సిపిఎం కమిటీ సభ్యులు మాదినేని రమేష్ మాతృమూర్తి భారతమ్మ గురువారం ఉదయం అనారోగ్యంతో మరణించారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న భారతమ్మ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు సీపీఎం నాయకులు తెలిపారు. విషయం తెలుసుకున్న జిల్లా సిపిఎం నేతలు, పలు సంఘాల నాయకులు భారతమ్మ పార్థివదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.