ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో రెండు రోజులుగా జరుగుతున్న రాజీవ్ గాంధీ మెమోరియల్ రాజీవ్ ట్రోఫీ ఉమ్మడి జిల్లా స్థాయి
క్రికెట్ పోటీలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. శుక్రవారం పోటీలను
కాంగ్రెస్ నాయకుడు తుమ్మల యుగంధర్, డీవైఎస్వో సునీల్ రెడ్డి క్రీడాకారులను పరిచయం చేసుకొని ప్రారంభించారు. రెండవ రోజు జరిగిన మొదటి మ్యాచ్లో ఖమ్మం అర్బన్ మండలం జట్టు రఘునాధపాలెం మండలం జట్టుపై 5 పరుగుల తేడాతో విజయం సాధించింది.