బీసీ స్టడీసర్కిల్ ఖమ్మం ఆధ్వర్యంలో ఈ నెల 22 నుంచి 75 రోజులపాటు గ్రూప్1(మెయిన్స్)కు అర్హత సాధించిన వారిలో 150 మంది అభ్యర్ధులకు ఉచిత కోచింగ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ముజిమ్మిల్ ఖాన్ తెలిపారు. కోచింగ్ సమయంలో ప్రతి అభ్యర్థికి రూ. 5వేల స్టైఫండ్ అందజేస్తామన్నారు. మెయిన్స్ కు అర్హత సాధించిన అభ్యర్థులు www. tgbcstudycircle. cgg. gov. in అనే వెబ్సైట్లో దరఖాస్తులను ఈ నెల 19 వరకు చేసుకోవాలన్నారు.