గురుపౌర్ణమి వేడుకలు గురువారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఆషాడ శుద్ధ పౌర్ణమి నుంచి వేడుకలను ప్రారంభించి 11 రోజుల పాటు నిర్వహించేందుకు ఖమ్మం జిల్లాలోని షిర్డీ సాయిబాబా మందిరాలు, ఆశ్రమాలు ముస్తాబయ్యాయి. ఈ ఉత్సవాల్లో సాయినాథునికి ప్రత్యేకంగా పంచామృతాలతో అభిషేకాలు, నగర సంకీర్తనలు, గ్రామోత్సవాలు, ఊరేగింపులు, కోలాట కార్యక్రమాలు వంటి కార్యక్రమాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.