డీసీసీబీలో మరో ఇద్దరిపై వేటు

60చూసినవారు
డీసీసీబీలో మరో ఇద్దరిపై వేటు
ఖమ్మం డీసీసీబీలో మరో ఇద్దరు ఉన్నతాధికారులు సస్పెండ్ అయ్యారు. పలు అంశాల్లో సంస్థకు నష్టం కలిగించేలా వ్యవహరించారని పేర్కొంటూ ఇద్దరు జనరల్ మేనేజర్లు ఏ. పద్మావతి, కె. నర్మదను సస్పెండ్ చేస్తూ రాష్ట్ర సహకార శాఖ డైరెక్టర్ పి. ఉదయ్ కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. రైతుబీమా ప్రీమియం వ్యవహారంలో పద్మావతి, బదిలీలు, ఇంక్రిమెంట్ల చెల్లింపులు, ఇతర అంశాల్లో నర్మదను సస్పెండ్ చేస్తున్నట్లు వెల్లడించారు.