ఖమ్మం నగరంలో సమర్థనం ట్రస్ట్ బెంగళూరు ఆధ్వర్యంలో విట్స్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ వారిచే అక్టోబర్ 1 వ తేదీన ప్రారంభమైన ఉచిత కంప్యూటర్ శిక్షణ కేంద్రాన్ని తనిఖీ మరియు విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమానికి సమర్థనం దివ్యంగుల సంస్థ రిపోర్టింగ్ మేనేజర్ సెంథిల్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా సెంథిల్ కుమార్ మాట్లాడుతూ నేటి పోటీ ప్రపంచంలో నైపుణ్యత లేనిదే ఉద్యోగం రాదని డిగ్రీ ఉన్నప్పటికీ కంప్యూటర్, కమ్యూనికేషన్ స్కిల్స్ లేనట్లయితే ఉద్యోగంలో రానించలేరని విద్యార్థులందరూ ఈ ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని తెలియచేశారు.