ఖమ్మం నగరంలోని కమాన్ బజార్ వెంకటేశ్వరస్వామి దేవాలయంలో, రిక్కాబజార్ దాసాంజనేయస్వామి దేవాలయంలో బ్రాహ్మణ బజారులోగల రామాలయంలో శనివారం రాత్రి 8-30 నిమిషాలకు ధనుర్మాసోత్సవ సందర్భంగా కూడారై ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయాలలో స్వామివార్లకు కూడారై ఉత్సవానికి పాయాసాన్ని తయారుచేసి పాశురం, తిరుప్పావై చదివి స్వామివారికి నివేదన చేశారు.