ఖమ్మం నగరం 21వ డివిజన్ శాంతినగర్ దగ్గర గల కోదండరామస్వామి దేవాలయంలో గురువారం ఉదయం ధనుర్మాసోత్సవ సందర్భంగా గోదాదేవికి ఘనంగా పసుపు కుంకుమలతో సారె బహుకరించారు. ఈ సందర్భంగా మోరిశెట్టి ఉపేందరరావు లక్ష్మి దంపతులు బ్రాహ్మణ బజార్ నరసింహస్వామి దేవాలయం దగ్గర నుండి మేళతాళాలతో ఊరేగింపుగా కోదండరామాలయానికి వెళ్ళి పూలు, పండ్లు సౌభాగ్యద్రవ్యాలను గోదాదేవికి బహుకరించారు.