పంచాయతీ ఎన్నికలకు బ్యాలెట్ పేపర్లు ఖమ్మం డీపీఆర్సీ భవన్ వచ్చాయి. అదనపు కలెక్టర్ పీ. శ్రీజ, జెడ్పీ సీఈవో దీక్షా రైనా సోమవారం వాటిని పరిశీలించారు. బ్యాలెట్ పేపర్లలో ఎటువంటి పొరపాట్లు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. జిల్లాలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.