
చార్ధామ్ యాత్ర నిలిపివేత
భారత్-పాక్ సరిహద్దుల వద్ద తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో చార్ధామ్ యాత్ర నిలిపివేస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. తదుపరి ఉత్వర్వులు వచ్చే వరకు చార్ధామ్ యాత్రను నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది.హెలికాప్టర్ సేవలను కూడా నిలిపివేసింది. పాక్ దాడుల నేపథ్యంలో బద్రినాథ్, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రిలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ 30న చార్ధామ్ యాత్ర ప్రారంభమైన సంగతి తెలిసిందే.