ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకంగా వచ్చే పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సూచించారు. భట్టితో పాటు మంత్రులు సి. దామోదర రాజనర్సింహ, తుమ్మల నాగేశ్వరరావు జిల్లా పెద్దాస్పత్రిని తనిఖీ చేయగా పలు విభాగాల్లో పరిశీలించి చికిత్స పొందుతున్న వారితో మాట్లాడారు. వైద్య సేవలెలా ఉన్నాయి. మందులు ఇస్తున్నారా అని ఆరా తీశారు. అనంతరం వైద్యులకు పలు సూచనలు చేశారు.