కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి ఎనలేని సేవ అందించిందని, అందువల్లనే నేడు దేశం నడుస్తుందని మేయర్ పునుకొల్లు నీరజ అన్నారు. గురువారం ఖమ్మం 38వ డివిజన్లో నిర్వహించిన జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ యాత్రను ప్రారంభించి మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగంపై దాడి, అంబేద్కర్ ఆశయాలను నీరుగారుస్తూ, మహాత్మా గాంధీ స్ఫూర్తిని దెబ్బతీసేలా పరిపాలన కొనసాగుతున్న తీరును తిప్పి కొట్టడమే ఈ యాత్ర ఉద్దేశమని తెలిపారు.