ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ ఆంక్షలు అమలులో ఉంటాయని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. హోలీ పండుగ వేడులను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని.. రోడ్లపై ట్రాఫిక్కు అంతరాయం కలిగించిన, వాహనాలపై గుంపులు. గుంపులుగా తిరుగుతూ.. పరిచయం లేని వ్యక్తులపై రంగులు జల్లడం, వాహనలపై వెళ్లేవారిపైనా వారి అనుమతి లేకుండా బలవంతంగా రంగులు చల్లిన, గొడవలు సృష్టించిన కఠిన చర్యలు తప్పవని అన్నారు.