ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని స్థానిక సమస్యలు పరిష్కరించాలని ఈ నెల 16న కేఎంసీ కార్యాలయాన్ని ముట్టడించనున్నట్లు సీపీఎం ఖమ్మం డివిజన్ కార్యదర్శి వై. విక్రమ్ అన్నారు. గురువారం రఘునాథపాలెం సీపీఎం మండల కమిటీ సమావేశంలో మాట్లాడారు. నగర పరిధిలోని సమస్యలపై సీపీఎం ఆధ్వర్యాన ఇంటింటి సర్వే చేపడుతుండగా. పలువురు పెన్షన్లు, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డులు తదితర సమస్యలను లేవనెత్తుతున్నట్లు పేర్కొన్నారు.