ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి మార్చురీలో కొద్ది రోజులుగా ఉంటున్న మృతదేహాల కోసం ఎవరూ రాకపోవడంతో బుధవారం అంత్యక్రియలు నిర్వహించారు. ఆస్పత్రి సిబ్బంది, ఔట్ పోస్ట్ పోలీసులు ఇచ్చిన సమాచారంతో అన్నం ఫౌండేషన్ ఆధ్వర్యాన బల్లేపల్లి వైకుంఠధామంలో అంత్యక్రియలు పూర్తిచేశారు. అన్నం ఫౌండేషన్ చైర్మన్ అన్నం శ్రీనివాసరావుతో పాటు అన్నం అమరేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు.