ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లికి చెందిన పద్మశ్రీ వనజీవి రామయ్య మరణ వార్త ప్రకృతి ప్రేమికులను కలిచివేసింది. వనజీవి రామయ్య ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందగా ఆయన మృతదేహాన్ని అన్నం ఫౌండేషన్ సభ్యులు వనజీవి ఇంటికి తరలించారు. పలువురు నాయకులు రామయ్య మృతదేహానికి నివాళులర్పించారు.