ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్మాణానికి బల్లేపల్లి వద్ద సేకరించిన భూముల్లో అసైన్డ్ భూములు కూడా ఉన్నాయి. ఈనేపథ్యాన గురువారం శంకుస్థాపన సభా వేదికపైనే ఆయా రైతులకు నివాస స్థలాల పట్టాలు పంపిణీ చేశారు. ఒక్కో రైతుకు ఎకరాకు 300గజాల చొప్పున 28 మందిలో ఐదుగురికి మంత్రులు పట్టాలు అందజేశారు. మిగతా వారికి త్వరలో ఇవ్వనున్నట్లు తెలిపారు. కాగా, కెనాల్ భూములకు పరిహారం చెల్లించాలని నిర్వాసితులు కోరారు.