కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు, మాజీ సర్పంచ్ గుత్తా వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఖమ్మం కలెక్టరేట్ లో డీఆర్వో రాజేశ్వరీకి వినతి పత్రం అందజేశారు. ఎన్నికలకు ముందు రైతులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చకుండా మోసం చేసిందని చెప్పారు. వరంగల్ డిక్లరేషన్ లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు.