దేశానికి సంపూర్ణ స్వాతంత్రం కోరింది కేవలం ఏఐటీయూసీ మాత్రమేనని ఆ సంఘం జాతీయ సమితి సభ్యులు బిజీ క్లేమెంట్ తెలిపారు. ఏఐటీయూసీ 105వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గురువారం ఖమ్మం ఇందిరా నగర్ లోని ఏఐటీయూసీ పైలాన్ వద్ద ఏర్పాటుచేసిన జెండాను ఆయన ఆవిష్కరించారు. అనంతరం జరిగిన ఆవిర్భావ సభలో మాట్లాడుతూ 1920కి ముందు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించినా అది కేవలం హోమ్ రూల్ మాత్రమే డిమాండ్ చేసిందని గుర్తు చేశారు.