ఖమ్మం: పత్రికా స్వేచ్ఛను హరించడం తగదు

78చూసినవారు
ఖమ్మం: పత్రికా స్వేచ్ఛను హరించడం తగదు
పత్రికా స్వేచ్ఛను హరించడం తగదని ఏఐఎస్ఎఫ్ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఇటికాల రామకృష్ణ అన్నారు. శనివారం ఖమ్మం గిరిప్రసాద్ భవన్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సాక్షి ఎడిటర్ ధనుంజయ్ నివాసంలో చొరబడి సోదాలు చేయడం పత్రిక స్వేచ్ఛను హరించడమే అన్నారు. ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎత్తిచూపుతూ ప్రజల పక్షాన నిలబడుతున్న జర్నలిస్టులపై దాడులు చేయడం దుర్మార్గపు చర్య అని విమర్శించారు.

సంబంధిత పోస్ట్