ఖమ్మం - మహబూబాబాద్ రోడ్డుకు వనజీవి రామయ్య పేరు పెట్టాలి

61చూసినవారు
ఖమ్మం - మహబూబాబాద్ రోడ్డుకు వనజీవి రామయ్య పేరు పెట్టాలి
తన జీవితం మొత్తం మొక్కలు నాటాడానికే అంకితం చేసిన పద్మశ్రీ దరిపల్లి రామయ్య ధరిత్రి ఉన్నంతకాలం చిరస్థాయిగా నిలిచి ఉంటారని రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. ఇటీవలే మృతి చెందిన వనజీవి రామయ్యకు మంగళవారం రవిచంద్ర రెడ్డిపల్లి లోని ఆయన నివాసానికి వెళ్లి నివాళులు అర్పించారు. అనంతరం రామయ్య పేరు ఎప్పటికీ గుర్తుండేలా.. ఖమ్మం - మహబూబాబాద్ రోడ్డుకు వనజీవి రామయ్య మార్గ్ పేరుతో నామకరణం చేయాలని ఎంపీ రవిచంద్ర కోరారు.

సంబంధిత పోస్ట్