ఖమ్మం: చెల్లని చెక్కు కేసులో ఏడాది జైలు శిక్ష

82చూసినవారు
ఖమ్మం: చెల్లని చెక్కు కేసులో ఏడాది జైలు శిక్ష
చెల్లని చెక్కు జారీ చేసిన వ్యక్తికి ఏడాది జైలు శిక్ష విధిస్తూ ఖమ్మం రెండో అదనపు ప్రథమ శ్రేణి కోర్టు న్యాయాధికారి ఏపూరి బిందుప్రియ బుధవారం తీర్పు చెప్పారు. ఖమ్మం రూరల్ మండలం ముద్దులపల్లికి చెందిన ఎటుకూరి లక్ష్మణరావు వద్ద ఖమ్మం గాంధీచౌక్ కు చెందిన వ్యాపారి మల్లెల నర్సింహారావు మూడు దఫాలుగా రూ. 21 లక్షల అప్పు తీసుకున్నాడు. ఈ క్రమంలో రూ. 5 లక్షల చెక్కు ఇచ్చినా ఖాతాల్లో సరిపడా నగదు లేక చెల్లలేదు.

సంబంధిత పోస్ట్