తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యాన 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించి పదో తరగతి, ఇంటర్ లో ప్రవేశాల ప్రక్రియ వచ్చేనెల 2న మొదలవుతుందని డీఈఓ సోమశేఖరశర్మ. తెలిపారు. దూర విద్యా విధానంలో చదివేందుకు ఆసక్తి ఉన్న అభ్యాసకులు వచ్చేనెల 2నుంచి 11 వరకు సెంటర్లు కలిగిన ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లను సంప్రదించాలని సూచించారు. వివరాలకు 8008403522 నంబర్ కు ఫోన్ చేయాలన్నారు.