ఖమ్మం: పథకాల అమలులో రాజకీయ వివక్ష తగదు

సంక్షేమ పథకాల అమలులో రాజకీయ వివక్ష తగదని, సంపద పెంచి పేదలకు పంచుతామని చెబుతున్న ప్రభుత్వం ముందుగా సంక్షేమ పథకాలను పేదలందరికీ వర్తింపజేయాలని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి దండి సురేష్ డిమాండ్ చేశారు. కేఎంసీలోని సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో బుధవారం ఖమ్మం కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడించారు. కార్యాలయంలో వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులకు కార్యకర్తలకు నడుమ తోపులాట జరిగింది.