ఖమ్మం నగరంలోని మమత రోడ్డులోని సబ్ స్టేషన్ పరిధిలో విద్యుత్ లైన్ల మరమ్మతుల దృష్ట్యా శుక్రవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని ఏఈ చావా లక్ష్మణ్ తెలిపారు. దీంతో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 11 కేవీ మైసమ్మ గుడి ఫీడర్ పరిధిలోని వరదయ్యనగర్, ఓల్డ్ గ్యాస్ గోదాం ఏరియాలో అంతరాయం ఉంటుందని తెలిపారు. వినియోగదారులు గమనించి సహకరించాలని ఏఈ కోరారు.