ఖమ్మం: పనులకు ప్రతిపాదనలు సమర్పించాలి

72చూసినవారు
ఖమ్మం: పనులకు ప్రతిపాదనలు సమర్పించాలి
జిల్లాలో వైద్య, ఆరోగ్య రంగంలో చేయాల్సిన పనులకు సంబంధించి ప్రతిపాదనలు సమర్పించాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. మంత్రులు సి. దామోదర రాజనర్సింహ, తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ఖమ్మం కలెక్టరేట్లో సమీక్షించారు. తొలుత జిల్లా పరిస్థితులను కలెక్టర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం భట్టి మాట్లాడుతూ పేదలకు మెరుగైన వైద్యం అందించేలా అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్