అప్పగించిన భాధ్యతలు సక్రమంగా నిర్వహించాలని తద్వారా శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా అప్రమత్తంగా వుండాలని ఖమ్మం సీపీ సునీల్ దత్ సెక్టార్ పోలీస్ అధికారులకు ఆదేశించారు. శుక్రవారం పోలీస్ స్టేషన్ల పరిధిలోని సెక్టార్ ఇంచార్జి పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో హనుమాన్ జయంతి ప్రదర్శన ప్రశాంత వాతావరణంలో జరిగేలా సెక్టార్ పోలీస్ అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు.