ప్రజలు దొడ్డు బియ్యం తినలేకపోతున్నారనే ఆలోచనతో ప్రభుత్వం సన్న బియ్యం పథకం అమలు చేసిందని ఖమ్మం సీపీ తెలిపారు. ఈ సన్నబియ్యంను దారి మళ్లించాలని ఎవరైనా ప్రయత్నిస్తే కఠిన చర్యలు ఉంటాయని సీపీ ఆదివారం తెలిపారు. ఇంటింటికి తిరిగి సన్నబియ్యం కొనుగోలు చేసే వారి వివరాలు సేకరించాలని పోలీసులను సీపీ ఆదేశించారు.