ఖమ్మం నగరంలోని వ్యవసాయ మార్కెట్ కు ఈనెల 12 నుంచి జూన్ 6 వరకు వరుసగా 26 రోజులు 'వేసవి' సెలవులు ప్రకటిస్తున్నట్లు మార్కెట్ కమిటీ చైర్మన్ యరగర్ల హన్మంత రావు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి సంవత్సరం వలె ఈ ఏడాది కూడా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు, కార్మికుల విజ్ఞప్తి మేరకు సెలవులు ఇచ్చినట్లు ఆయన తెలిపారు. మార్కెట్లో తిరిగి జూన్ 7న శనివారం నుంచి యధావిధిగా క్రయ, విక్రయాలు ఉంటాయని ఆయన తెలిపారు.