ఖమ్మం: ఉపాధ్యాయుల సర్దుబాటు పారదర్శకంగా చేపట్టాలి

67చూసినవారు
ఖమ్మం: ఉపాధ్యాయుల సర్దుబాటు పారదర్శకంగా చేపట్టాలి
రాబోయే విద్యా సంవత్సరానికి ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ అత్యంత పారదర్శకంగా చేపట్టాలని టీఎస్ యూటీఎఫ్ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఖమ్మం జిల్లా విద్యాశాఖాధికారి సామినేని సత్య నారాయణకు వినతి పత్రం సమర్పించింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షేక్. రంజాన్, పారుపల్లి నాగేశ్వరరావు మాట్లాడుతూ. కాంప్లెక్స్ లేదా మండలాన్ని యూనిట్ గా తీసుకొని సర్దుబాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్