ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో రెండేళ్ల పాటు ఇన్ పేషంట్, డ్యూటీ డాక్టర్లు, థెరఫిక్ పేషంట్లకు అవసరమైన భోజన వసతి చేయడానికి టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ ఎల్. కిరణ్ కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలోని తమ కార్యాలయంలో డిసెంబర్ 6 వరకు టెండర్ ఫారం లభిస్తుండగా.. వారిని పూర్తి చేసి డిసెంబర్ 9లోగా సమర్పించాలని సూచించారు.