దేశమంతటా ఒకేసారి ఎన్నికలు జరగాలనేదే తమ పార్టీ విధానమని ఎంపీ మాధవనేని రఘునందన్ రావు తెలిపారు. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే వ్యయం తగ్గుతుందని, ఆ నిధులతో సంక్షేమ పథకాల అమలుకు అవకాశముంటుందని చెప్పారు. ఖమ్మంలో శుక్రవారం 'వన్ నేషన్ వన్ ఎలక్షన్' అంశంపై ఏర్పాటు చేసిన సదస్సులో మాట్లాడారు. అంతటా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనే ప్రతిపాదనపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శల్లో నిజం లేదన్నారు.