వనజీవి రామయ్య అంతిమయాత్ర పూర్తి అయ్యింది. మొక్కల ప్రేమికుడు రామయ్య.. శనివారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన భౌతికకాయానికి మంత్రి పొంగులేటి, ఎంపీ రఘురాంరెడ్డి, ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ నివాళులర్పించారు. ఏదులాబాద్ పరిధి రెడ్డిపల్లి శ్మశానవాటికలో ఆదివారం రామయ్య అంత్యక్రియలు పూర్తి అయ్యాయి. ఆయనను కడసారి చూసేందుక అభిమానులు భారీగా తరలివచ్చారు.