సింగరేణి సంస్థ జీడికే-2 గనిలో గుండెపోటుతో ఓ కార్మికుడు మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నరేష్ అనే కోల్ కట్టర్ కార్మికుడి మృతి మొదటి షిఫ్ట్ డ్యూటీకి వెళ్లాడు. ఆయనకు మాస్టర్ పడే సమయంలో గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయాడు. సకాలంలో అంబులెన్స్ రాకపోవడం వల్లనే కార్మికుడు మృతి చెందాడని కార్మికులు శుక్రవారం ఆరోపిస్తున్నారు. నరేష్ మృతిని ప్రమాద సంఘటనగా గుర్తించాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.