మున్నేరు వరద బాధితులకు ఎన్నారై అసోసియేషన్ వారు అందించిన నిత్యావసర సరుకులను శుక్రవారం ఖమ్మం జిల్లా ప్రధాన కార్యాలయం వద్ద డివైఎఫ్ఐ నాయకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి షేక్ బషీరుద్దీన్ మాట్లాడుతూ.. వరదల్లో సర్వం కోల్పోయిన వారికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఎ జిల్లా ఉపాధ్యక్షులు చింతల వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.