ఇటీవల తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన ఖమ్మం జిల్లా కాంగ్రెస్ సీనియర్ నేత రాయల నాగేశ్వరరావును హైదరాబాద్లోని తన ఛాంబర్లో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కొర్రా లక్ష్మి సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను బహుకరించారు. అనంతరం రాయలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్న గిడ్డంగుల ప్రస్తుత పరిస్థితిని రాయల అడిగి తెలుసుకున్నారు.